జార్ఖండ్లోని గర్హ్వాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాంకా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గోదర్మాన బజార్లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ దీపక్ పాండే తెలిపారు.