పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నదుల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించడం కష్టతరమవుతున్న వేళ ‘అటానమస్ రోబో’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోబోకు సెన్సార్లు, జీపీఎస్, కెమెరాలు ఉండటంతో పాటు నీటిని ఫిల్టర్ చేసి శుద్ధి చేస్తూ చెత్తను తొలగిస్తుంది. ఇలాం
టి వాటిని మనం కూడా తయారు చేయాలని స్టార్టప్లు ఇలాంటివి చేస్తే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.