పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ద్విశతకం సాధిస్తాడని న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టీ 20ల్లో 200 మార్క్ను ఎవరు అందుకుంటారు' అనే ప్రశ్నకు విలియమ్సన్.. రోహిత్ శర్మ అని చెప్పాడు. టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ ఇప్పటివరకు ఔదు శతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 121. ఇక ఐపీఎల్లో హిట్మ్యాన్ రెండు సార్లు మూడంకెల స్కోరు అందుకున్నాడు.