ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భాగంగా మూడో టీ20లో భారత్ ఓడిపోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అదిల్ రషీద్ కట్టుదిట్టంగా బంతులేయడంతోనే పరాజయం తప్పలేదన్నాడు. టాప్ ఆర్డర్ అనవసర షాట్లు ఆడి త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం కూడా ఓటమికి కారణమైందన్నారు. ఏదీ ఏమైనా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ తమ కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చిందని తెలిపాడు.