AP: పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ పరిధిలో 28 మంది వీఆర్వోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. 12 మంది విలేజ్ సర్వేయర్లకు బుదవారం ఆర్డీవో మురళీకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వేలో వీఆర్వోలు, సర్వేయర్లపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నటు ఆర్డీవో వెల్లడించారు.