పాయల్ రాజ్పుత్ ఆర్ఎక్స్-100 సినిమాలో బోల్డ్గా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే పాయల్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ 21 ఏళ్లకే మోడలింగ్ మొదలుపెట్టాను. ఈ ఫొటో అదే. ఓ మ్యాగజైన్ కోసం మొదటి సారి ఫొటో షూట్ చేయించుకున్నా. ఢిల్లిలో ఈ షూట్ జరిగింది. తర్వాతే ముంబైకి షిఫ్ట్ అయ్యాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.