దేశంలో యువతకు
ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని
మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ విఫలమైందని ఎక్స్లో
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. దాదాపు 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి పదేళ్లుగా
బీజేపీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో 22 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. 7 లక్షల మందికి మాత్రమే
ఉద్యోగాలు లభించాయన్నారు.