భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.