అమరవీరులకు ఎలాంటి పరిహారం చెల్లించడం లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఖండించారు. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ అసత్యాలు వల్లె వేశారని విమర్శించారు. ఇంతకంటే మరో పెద్ద అబద్ధం ఏదీ ఉండదన్నారు. అమరవీరులకు రూ. కోటి పరిహారం అందిస్తున్నామని రక్షణ మంత్రి స్వయంగా సభలో వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ విపక్ష నేతగా తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టారని, కానీ ఇవాళ ఆయన బాధ్యతారాహిత్య ప్రకటన చేశారన్నారు.