సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రిక్వెస్ట్ చేశారు. లడక్లో మృతి చెందిన ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సోమవారం ఎక్స్లో ట్విట్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణలో భాగమైన జవాన్లు అమరులయ్యారని, వారి సేవలు చిరస్మరణీయమని చెప్పారు. జవాన్ల కుటుంబాలకు వైసీపీ నేతలు బాసటగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.