ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జూన్లో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎస్ఎస్సీ పరీక్షలు 15,058 మంది రాయగా.. 9,531 మంది (63.30%) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా.. 18,842 మంది (69.07%) ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను https://apopenschool.ap.gov.inలో తెలుసుకోండి.