తెలంగాణలో లోక సభ ఎన్నిక పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు.. 500 మంది తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు పనిచేస్తున్నాయి. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలు, తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 7 వేల మంది హోంగార్డులను రప్పించారు. 17లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.