సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన హేమమాలిని ఎన్నో ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 1963లో తమిళ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చిన హేమమాలిని తన అద్భుత నటనతో బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్గా పేరు గాంచారు. చాలా ఏళ్లుగా బీజేపీలో యాక్టివ్గా ఉన్న హేమమాలిని 2014 నుంచి ఉత్తర్ప్రదేశ్లోని మధుర ఎంపీగా రెండుసార్లు గెలిచారు. తాజా ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.