హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మృతదేహం గుర్తింపు

78చూసినవారు
హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మృతదేహం గుర్తింపు
ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇటీవల హతమైన హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మృతదేహం ఆచూకీ లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్‌బొల్లా తాజాగా వెల్లడించింది. అయితే, నస్రల్లా మృతదేహంపై ప్రత్యక్షంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని సమాచారం. దీంతో, బాంబు దాడి జరిగిన సమయంలో షాక్‌కి గురై ఆయన మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్