హోర్డింగ్ కూలి 8మంది మృతి.. 65మందికి గాయాలు (Video)

23529చూసినవారు
దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. ముంబైలోని ఘట్కోసర్ ప్రాంతంలో ఓ పెట్రోల్ పంపు వద్ద బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దాని కింద పడి 8 మంది మరణించారు. 65 మందికిపైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద మరో 30 మంది చిక్కుకున్నట్లుగా BMC అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్