కుంకుమపువ్వు విత్తనాలు విత్తడానికి ముందు పొలాన్ని పూర్తిగా దున్నుకోవాలి. అంతే కాకుండా చివరి దుక్కి దున్నడానికి ముందు ఒక హెక్టారుకు 20 టన్నుల ఆవు పేడ ఎరువుతో పాటు 90 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, పొటాష్ను వేయాలి. దీంతో కుంకుమపువ్వు ఉత్పత్తి పెరుగుతుంది. మైదాన ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి మధ్య కుంకుమ విత్తనాలను విత్తుతారు. కుంకుమపువ్వు కోయడానికి ఉత్తమ సమయం జూలై - ఆగస్టు. ఎత్తైన కొండ ప్రాంతాలలో అయితే జూలై మధ్యకాలం.