ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకులో దాచిన బంగారాన్ని ప్రత్యేక విమానంలో ఆర్బీఐ భారత్కు తీసుకురానుంది. కేంద్ర ఆర్థిక శాఖ, కస్టమ్స్, ఏవియేషన్, స్థానిక విభాగాల సమన్వయంతో భారీ భద్రత మధ్య దీన్ని స్టోరేజ్ యూనిట్లకు తరలించనుంది. బయటి నుంచి తెస్తున్న ఈ మొత్తానికి కస్టమ్స్ డ్యూటీ మినహాయించింది. కానీ జీఎస్టీలో రాష్ట్రాలకి వాటా వెళ్లే ఐజీఎస్టీని ఆర్బీఐ చెల్లించాలి. 1991లోనూ ఇలాగే విమానంలో పసిడిని యూకేకు తరలించారు.