ఢిల్లీలోని ఓఖ్లా రైల్వే స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్ప్రెస్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. కొన్ని కోచ్లు మంటల్లో కాలిపోయాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టు సమాచారం.