గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

66చూసినవారు
గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి IPL 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో మెట్రో రైలు టైమింగ్స్ ని పొడిగించింది. చివ‌రి మెట్రో రైలు రాత్రి 12.15 గంట‌ల‌కు బ‌య‌లుదేరి 1.10 గంట‌లకు గ‌మ్యస్థానానికి చేరుకుంటుందని ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఇది ఐపీఎల్ సీజన్ ముగిసే వరకూ ఉంటుందని, నాగోల్‌, ఉప్ప‌ల్‌, స్టేడియంతో పాటు NGRI స్టేష‌న్‌ల‌లో మాత్ర‌మే ఎంట్రీ ఉంటుంద‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్