గణేశ్ శోభాయాత్ర వేళ మార్గదర్శకాలను విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు

58చూసినవారు
గణేశ్ శోభాయాత్ర వేళ మార్గదర్శకాలను విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు మెుదలయ్యాయి. దీంతో భక్తులు పాటించవలసిన నిబంధనల గురించి హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. శోభాయాత్రలో ఒక వాహనంలో ఒక విగ్రహాన్ని మాత్రమే తీసుకెళ్లాలని, ఆ వాహనంపై లౌడ్ స్పీకర్, డీజే సిస్టమ్ ఉండకూడదని స్పష్టం చేశారు. ఆ వాహనంలో మద్యం తాగిన వ్యక్తులు ఉన్నా, ఆయుధాలు, మండే పదార్థాలు తీసుకెళ్లినా అనుమతించరని తెలిపారు. బాణాసంచా కాల్చొద్దు. కలర్లను బాటసారులపై వేయొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్