అంబర్ పేట్ డివిజన్ పరిధిలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ స్థైన ఎమ్మేల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మంగళవారం ప్రచారం చేశారు. గత ప్రభుత్వంలో తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ది గురించి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ను తమ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల గళం వినిపించాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.