జాతీయ స్థాయిలో మే నెల 5న నిర్వహించనున్న నీట్ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానెల్స్ స్పెషల్ లైవ్ లెసన్స్ ప్రసారం చేస్తాయని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఇంటర్ పూర్తయ్యాక
విద్యార్థులు డాక్టర్ కావాలనే ప్రత్యేక లక్ష్యంతో రాసే ‘
నీట్’ పరీక్ష కోసం ఈ నెల 24 నుంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా స్పెషల్ లైవ్ అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.