జైన్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్సీ

73చూసినవారు
జైన్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్సీ
శాస్త్రిపురం డివిజన్ పరిధిలోని జైన్ కాలనీలో గురువారం ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ పర్యటించారు. స్థానికంగా మంచినీటి సరఫరా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం పూట మంచినీటి సరఫరా సమయాన్ని పెంచాలని స్థానికులు కోరగా, వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేల చూస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్