సొంత ఊర్లకు బయలుదేరుతున్న ఓటర్ మహాశయులు
ఎల్బీనగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై ఆంధ్రకు వెళ్లే ప్రణీకులతో సందడిగా మారింది. వరుసగా మూడు రోజులు సెలవు రోజులు కావడంతోపాటు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుండే ఆంధ్రకు వేళ్ళే ఓటర్లతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.