చాంద్రాయణగుట్ట - Chandrayangutta

వీడియోలు


హైదరాబాద్
పదిహేనేళ్లకు పజ్జన్న ఓటు పజ్జన్నకే
May 12, 2024, 07:05 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్

పదిహేనేళ్లకు పజ్జన్న ఓటు పజ్జన్నకే

May 12, 2024, 07:05 IST
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేరు. సికింద్రాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి పద్మారావు (పజ్జన్న) సనత్ నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ టకారాబస్తీలో ఉంటారు. ఆయన 5 మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఒక్కసారే తన ఓటు తాను వేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఓట్లు 25 వరకు ఉన్నా వారూ పజ్జన్నకు వేయలేరు. 2004, 2008 ఉపఎన్నిక, 2014, 2018, 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయగా సనత్ నగర్ నియోజకవర్గంలో ఓటేశారు. 2009లో సనత్ నగర్ నుంచి పోటీచేసి ఓటేసుకున్నా విజయం వరించలేదు. తాజాగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉండటం దాని పరిధిలోనే సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో పజ్జన్న 15 ఏళ్ల తరువాత తన ఓటును తనే వేసుకునే అవకాశం వచ్చింది.