మంగళ్ హాట్ డివిజన్ దత్తాత్రేయనగర్లో మంగళవారం హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రచారం నిర్వహించారు. పాతబస్తీలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే మోదీకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి ఎంపీగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.