భాగ్యనగర్ గణేష్ కమిటీ బోరబండ డివిజన్ మహిళ కన్వీనర్ కే ఉష ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్ ఆర్ ఆర్ పురం కాలనీ, బోరబండ, తదితర ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మట్టి వినాయకుల ప్రతిమల గురించి వివరించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడి ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.