రాయదుర్గం మల్కం చెరువు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం...

58చూసినవారు
రాయదుర్గం మల్కం చెరువు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నంది హిల్స్ నుండి వేగంగా వచ్చి మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిను వేగంగా కారు ఢీ కొట్టినది. దాంతో కారు నుజ్జు నుజ్జు అయినది. కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మృతుడు బీబీఏ చదువుతున్న విద్యార్థి చరణ్(19). రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్