ఢిల్లీకి చెందిన అకడమిక్ రీసెర్చర్ శశాంక్ మను హైదరాబాద్ మెట్రో స్టేషన్లన్నింటినీ అతి తక్కువ సమయంలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 2 గంటల, 41 నిమిషాల, 31 సెకన్లలో హైదరాబాద్ కారిడార్లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్లను శశాంక్ సందర్శించాడు. ఈ రికార్డును కలిగి ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణించిన వ్యక్తిగా గతంలోనూ ఇతనిపై రికార్డు ఉంది.