వాటర్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కార్పొరేటర్

72చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాం కాలనీలో కొనసాగుతున్న వాటర్ లైన్ మరమ్మత్తు పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ నాజిరుద్దీన్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. స్థానికంగా వాటర్ పల్యూషన్ సమస్యలు ఉన్నాయని ఫిర్యాదుల మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి స్థానికులకు యథాతదంగా నీటి సరఫరా పునరుద్ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్