గడిచిన 24 గంటల్లో 14, 58, 200 నగదు సీజ్: కమిషనర్

62చూసినవారు
గడిచిన 24 గంటల్లో 14, 58, 200 నగదు సీజ్: కమిషనర్
ఎన్నికల ప్రవర్తనా నియమవాలిలో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 14, 58, 200 నగదు సీజ్ చేశామని హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ. 3, 55, 584 విలువైన వస్తువులను పట్టుకున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 58. 76 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని ఆరు కేసులు నమోదు చేసి ఏడుగురిని ఆరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 10 పిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామన్నారు.

సంబంధిత పోస్ట్