బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి

82చూసినవారు
బాలానగర్ పిఎస్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మధ్య ప్రదేశ్ రాష్ట్రం బాల్కోట్ జిల్లా వాసి కమలేశ్ మేశ్రం(45) కొంత కాలంగా చింతల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్