యువకుడు అదృశ్యం

63చూసినవారు
యువకుడు అదృశ్యం
తండ్రి మందలించడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హర్యానాకి చెందిన మక్సూద్ ఖాన్ కుటుంబం పదేళ్ల క్రితం జీవనో పాధి నిమిత్తం పహాడీషరీఫ్ కు వలస వచ్చి నివాసం ఉంటుంది. కాగా ఇతని చిన్న కుమారుడు మహ్మద్ ఇక్రం జేసీబీ డ్రైవింగ్ కు వెళ్లకపోవడంతో మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఇక్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్