ప్రాణం మీదకు తెచ్చిన క్రీకెట్ గేమ్

73చూసినవారు
మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాయి నగర్ లో బిల్డింగ్ పైన క్రికెట్ ఆడుతూ ప్రమాదశాత్తు హైటెన్షన్ కరెంట్ తీగలు తగిలి విష్ణు సాయి(24) కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్