ఆత్వెల్లి ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన మేళా

61చూసినవారు
ఆత్వెల్లి ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన మేళా
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆత్వెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు ఘనంగా విజ్ఞాన మేళాను అగస్త్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ విజ్ఞాన మేళాలో దాదాపు 50 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ సైన్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు, అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధిలు శ్యాం కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్