భార్య రూ. 150 ఇవ్వలేదని భర్త బలవన్మరణం

7323చూసినవారు
భార్య రూ. 150 ఇవ్వలేదని భర్త బలవన్మరణం
భార్యను రూ. 150 అడిగితే ఇవ్వలేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శామీర్ పేట్ పోలీసుల కథనం ప్రకారం. ఒడిశాకు చెందిన దీంటు సాహూ(24), బిష్టు సాహక్ దంపతులు బతుకుదెరువుకు శామీర్ పేట్ మండలం మజీద్పూర్ కు వలస వచ్చారు. ఆదివారం తనకు డబ్బు ఇవ్వాలని భార్యతో గొడవ పడగా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురై అతడు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని భార్య చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్