కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో శుక్రవారం గంజాయి తరలిస్తున్న ముఠా ను రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి డిల్లీకి వయా హైదారాబాద్ మీదుగా, హోండా సిటీ కార్ లో తరలిస్తున్నారన్న సమాచారం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి 86కేజీల గంజాయి తో పాటు ఒక కారు, 2సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.