విశాఖ టు హైదరాబాద్ గంజాయి సప్లై

1524చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ లోని బాలనగర్ ఎస్ఓటి, మేడ్చల్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరనుండి 2. 2 లీటర్ల హాషిస్ ఆయిల్ , 3 సెల్ ఫోన్స్, పల్సర్ భైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్టణానికి చెందిన కుమార్ స్వామి, అజయ్ కుమార్, స్వామి గణేష్ లు అరెస్టు చేసి రిమాండ్ తరలించమని డిసిపి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్