పోలింగ్ స్టేషన్ లను సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
కుత్బుల్లాపూర్ పరిధి గాజులరామరం, బహుదూర్ పల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో ఓట్ల ప్రక్రియను సోమవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల కమిషనర్ వారు ఏర్పాట్లు బాగా చేశారని అన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని వారు అన్నారు.