తెలంగాణలో రౌడీ రాజకీయాలకు ఇది పరాకాష్ట..

52చూసినవారు
తెలంగాణలో రౌడీ రాజకీయాలకు ఇది పరాకాష్ట..
మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ గుండాలు చేసిన దాడిని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పోరెడ్డి ధర్మారెడ్డి మంగళవారం తీవ్రంగా ఖండించారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్‌ కారును అడ్డుకుని దాడి చేశారు. కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ గుండాలు చేసిన దాడి ఒక పిరికిపంద చర్యని అన్నారు.

సంబంధిత పోస్ట్