బన్సిలాల్ పేట్ డివిజన్ న్యూ భోయిగూడకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర యువ నాయకులు మర్రి పూరూరవ రెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాలన్నారు. కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.