సికింద్రాబాద్ సివిల్ కోర్టు సీనియర్ న్యాయవాది వెంకటరమణ బుధవారం మారేడుపల్లిలోని ఇండియన్ బ్యాంకులో చాలన్ చెల్లించేందుకు వెళ్లి అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సిపిఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తార్నాకలో నివాసం ఉండే న్యాయవాదికి భార్య, ఇద్దరు కూతుళ్లు.