తెలంగాణలో 20 రోజుల వ్యవధిలో బెట్టింగ్ కారణంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం గద్దపాకకు చెందిన బూస కార్తీక్ (25), శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన ఎడిగ మధు(33), వీణవంక మండలం బేతిగల్కు చెందిన గుమ్మడి రిషివర్ధన్(18) సూసైడ్ చేసుకున్నారు. పెద్దపల్లిలోని చొప్పరి దేవేందర్(35), కామారెడ్డికి చెందిన చాకలి చింటు (27), ఖమ్మంలోని YSR నగర్కు చెందిన షేక్ అజీజ్(29) బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.