మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్, బేగంపేట్, డివిజన్ లోని బ్రహ్మన వాడిలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు స్థానికులు ఎమ్మేల్యేలు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో యువతి యువకులు హోళీ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.