సనత్‌నగర్ - Sanathnagar

వీడియోలు


హైదరాబాద్
మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది : కిషన్ రెడ్డి
May 11, 2024, 08:05 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్

మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది : కిషన్ రెడ్డి

May 11, 2024, 08:05 IST
తార్నాక కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కార పరిస్థితి వచ్చిన పార్టీలోనే కొనసాగాను అని పూర్తిగా పార్టీ కోసమే సమయం ఇచ్చే కార్యకర్తను నేను అని అన్నారు. మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దులో ఆయన భాగ్యమైనట్లు తెలిపారు. సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ద్వార తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం వంటి వాటి నుంచి బయటపడ్డామని 2014 తర్వాత మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. టెర్రరిజం పైన జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్తున్నామని మోడీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయాలకు అతీతంగా దేశం మరింత ముందుకు వెళ్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని పార్టీలకు అతీతంగా దేశం కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలన్నారు. బిజెపిని, మోదీ ని ఆశీర్వదించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తనని గెలిపించాలని కోరారు.