కిషన్ రెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ ప్రచారం
సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా అమీర్ పేట్ డివిజన్ పరిధిలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళ ఆదివారం ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ది పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సేవకు అంకితమైన కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలాన్నారు.