సనత్‌నగర్ - Sanathnagar

కాంగ్రెస్ కు ఓటేస్తే.. భాజపాకు చేరుతుంది: కేటీఆర్

కాంగ్రెస్ కు ఓటేస్తే.. భాజపాకు చేరుతుంది: కేటీఆర్

దేశంలో భాజపాను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడ, ముషీరాబాద్ లోని వేర్వేరు పంక్షన్ హాల్ లో భారాసా ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ కు మద్దతుగా నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారని, భవిష్యత్తులో ఆయన భాజపాలో చేరబోదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమానికి రూ.2300 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ నేతృ త్వంలోని సర్కార్కే దక్కుతుందని ఆయన చెప్పారు. భారాస ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, తలసాని శ్రీనివాసయాదవ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు