ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వ్యక్తి మృతి

7568చూసినవారు
ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వ్యక్తి మృతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ ఫారంలో ఫలక్నామ ఎక్స్ ప్రెస్ రైల్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి అడ్డగుట్ట చెందిన కే శివ (45) తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు దినసరి కూలీ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్