చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా శనివారం కంటోన్మెంట్లోని పలు ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉ. 10 నుంచి మ. 1. 30 గంటల వరకు 33/11 కేవీ జింకాన స్టేషన్ 11 కేవీ విక్రంపురి ఫీడర్, మ. 2. 30 నుంచి 5 గంటల వరకు 33/11 కేవీ తిరుమలగిరి సబ్ స్టేషన్ 11 కేవీ శ్రీ నగర్ కాలనీ ఫీడర్, 33/11 కేవీ జింకాన స్టేషన్ 11 కేవీ తాడ్ బండ్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.