కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత ని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నియమించిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ బోర్డు మెంబర్స్ , నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, హాజరయ్యారు.