తాగునీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలి

71చూసినవారు
తాగునీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలి
నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్